సూర్యభగవానుడికి తాకిన భానుడి కిరణాలు

70చూసినవారు
సూర్యభగవానుడికి తాకిన భానుడి కిరణాలు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును భానుడి కిరణాలు మంగళవారం ఉదయం తాకాయి. ఉదయం 6.05 గంటలకు సూర్య కిరణాలు ధ్వజస్తంభం మీదుగా స్వామిని చేరాయి. ఆ సమయంలో మూలవిరాట్ బంగారుఛాయలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులుదీరారు.

సంబంధిత పోస్ట్