కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సోములు రాజేశ్వరరెడ్డి గురువారం గండెపోటుతో మరణించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రాజేశ్వరరెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట వైసీపీ నాయకులు ఉన్నారు.