
కరెంట్ షాక్ కొట్టి 18 ఏళ్ళ యువతి మృతి
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నీటి ట్యాంక్ నింపాలని మోటార్ స్విచ్ ఆన్చేస్తుండగా.. నిసర్గ (18) అనే యువతి కరెంటు షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి హొళెహొన్నూరు సమీపంలోని ఎమ్మెహట్టి గ్రామంలో జరిగింది. యువతి హొళెహొన్నూరులోని ప్రభుత్వ కాలేజీలో పీయూసీ చదువుతోంది. అప్పటివరకూ కళ్లముందున్న కూతురు క్షణాల్లో విగతజీవి కావడంతో తల్లిదండ్రులు బోరుమన్నారు.