జమ్మూకశ్మీర్ రాంబన్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో బ్యాటరీ చెష్మా అనే ప్రాంతంలో ఒక ఎస్యూవీ కారు అదుపు తప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.