కారు లోయలో పడి 10 మంది మృతి (వీడియో)

72చూసినవారు
జమ్మూకశ్మీర్‌ రాంబన్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో బ్యాటరీ చెష్మా అనే ప్రాంతంలో ఒక ఎస్‌యూవీ కారు అదుపు తప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, సివిల్‌ క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌(క్యూఆర్టీ) అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

ట్యాగ్స్ :