యూపీలో వర్షాల వల్ల 34 మంది మృతి

773చూసినవారు
యూపీలో వర్షాల వల్ల 34 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది. గత 24 గంటల్లో పిడుగులు, భారీ వర్షాల వల్ల ఆ రాష్ట్రంలో కనీసం 34 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అధికారిక గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రంలో జూలై 9, 10 తేదీల్లో వర్షాల వల్ల 133 భవనాలు కూలిపోయాయి.