హైదరాబాద్లో 80 కేజీల గంజాయి స్వాధీనం

81చూసినవారు
హైదరాబాద్లో 80 కేజీల గంజాయి స్వాధీనం
హైదరాబాద్లోని బాచుపల్లి చౌరస్తాలో కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీలో 4 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు కాజీపల్లిలో ఓ ఇంటి పై ఆకస్మిక తనిఖీలు చేసి 76 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని మరో ఇద్దరు నిందితులు అయిన అంకుష్, పాషా లను అరెస్ట్ చేశారు. మొత్తంగా 22 లక్షల విలువైన 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.