పుట్టిన రోజు నాడే బాలిక మృతి

79చూసినవారు
పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన పంజాబ్ లోని పటియాలాలో చోటు చేసుకుంది. ఓ కుటుంబం తన కుమార్తె బర్త్ డే సందర్భంగా బేకరీ నుంచి కేక్ కొని తీసుకొచ్చింది. అయితే ఆ కేక్ తిన్న వెంటనే తన కుమార్తె చనిపోయిందని, మరికొందరు అస్వస్థతకు గురయ్యారని ఆ కుటుంబం ఆరోపిస్తోంది. అప్పటివరకూ తన పుట్టిన రోజును ఎంజాయ్ చేస్తూ కేకు తిన్న బాలికకి సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్