దుబాయ్లో వరదల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం కీలక సూచన చేసింది. దుబాయ్కు వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని తాజా అడ్వైజరీలో పేర్కొంది. భారీ వరదల నేపథ్యంలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది.