ఎవరెస్ట్ ఫిష్ మసాలాకు ఎదురుదెబ్బ

65చూసినవారు
ఎవరెస్ట్ ఫిష్ మసాలాకు ఎదురుదెబ్బ
భారత్‌లోని పాపులర్ మసాలా బ్రాండ్ ఎవరెస్ట్‌కు సింగపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. చేపల కూరలో వాడే మసాలాను వినియోగించవద్దని అక్కడ ప్రభుత్వం సూచించింది. అందులో ఇథిలిన్ ఆక్సైడ్ అనే పురుగుమందు అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయని పేర్కొంది. ఇదివరకే కొనుగోలు చేసిన వారు కూరల్లో వాడకుండా జాగ్రత్త పడాలని కోరింది. భారత్ నుంచి దిగుమతి అవుతున్న మసాలాలను తిరిగి పంపించేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్