కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. డిఫెన్స్ చీఫ్ మృతి

65చూసినవారు
కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. డిఫెన్స్ చీఫ్ మృతి
కెన్యాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లా(61) మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆయనతో పాటు మరో 11 మంది ఉన్నారని, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. నైరోబీ నుంచి 400 కి.మీ దూరంలోని మారుమూల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై దేశాధ్యక్షుడు విలియం రూటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కెన్యాలో గత 12 నెలల్లో 5 సైనిక హెలికాప్టర్లు కుప్పకూలడం గమనార్హం.

సంబంధిత పోస్ట్