CM జగన్ మీద జరిగిన రాళ్ల దాడి సంచలనం రేపింది. అయితే ఈ కేసులో జగన్ మీద రాళ్ళ దాడి చేసిన సతీష్ అనే నిందితుడిని విచారించగా చాలా విషయాలు బయటకు వచ్చాయి. జగన్ మీద నిందితుడు సతీష్ ఒకసారి కాదు రెండు సార్లు రాయితో దాడి చేశాడని సమాచారం. సతీష్ తొలిసారి జగన్ వాహనం డాబా కొట్టు సెంటర్ వద్ద ప్రయాణిస్తున్న సమయంలో రాయి విసిరితే అది తగలలేదట. ఆ తరువాత వివేకానంద స్కూల్ సమీపానికి వచ్చి మరోసారి రాయిని గురి చూసి విసిరితే అది గట్టిగానే తగిలింది.