AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు తృటిలో ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు వెళ్తుండగా రామరాజు పల్లి వద్ద ఆయన కాన్వాయ్లోని వాహనాలు ఢీ కొన్నాయి. వాహన శ్రేణిలో ఇన్నోవా వాహనాన్ని ఫైర్ ఇంజన్ వాహనం ఢీకొంది. అయితే ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇవాళ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనకు జగన్ వెళ్తున్నారు.