ఆవుదూడను సజీవంగా మింగేసిన కొండచిలువ

75చూసినవారు
ఆవుదూడను సజీవంగా మింగేసిన కొండచిలువ
ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో భారీ కొండచిలువ ఓ ఆవు దూడను సజీవంగా మింగేసింది. చిత్రహత్ ప్రాంతంలోని పరానా గ్రామంలో గల యమునా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ చోట కొండచిలువను గొర్రెల కాపరులు గుర్తించారు. 16 అడుగుల ఈ పైతాన్‌ ఆవు దూడ సగ భాగాన్ని మింగేసి.. మిగతా సగభాగాన్ని చుట్టేసుకుని కనిపించింది. స్థానికులు వెంటనే దూడను కాపాడే ప్రయత్నం చేశారు. పైతాన్‌ పొట్ట నుంచి ఆవును బయటకు తీసినప్పటికీ.. అది అప్పటికే ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత పోస్ట్