మార్చి 25న దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్కు చెందిన మహిళా సబ్ ఇన్స్పెక్టర్ వీడియో వైరల్ అవుతోంది. సాయంత్రం 4 గంటల వరకు హోలీ ఆడిన తర్వాత ఇళ్లకు వెళ్లాలని, లేనిపక్షంలో పోలీసులు లత్మార్ హోలీ నిర్వహిస్తారని ఈ వీడియోలో ప్రకటించారు. ఈ వీడియో బయటకు రావడంతో ఓ న్యాయ విద్యార్థి సీఎం, ఎన్నికల సంఘానికి లేడీ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.