విశాఖలోని ఆటోనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్.బ్లాక్లో ప్రమాదవశాత్తు సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా గణేష్ (31) విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ప్రమాదవశాత్తు నేలబాలిలో పడి ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.