అన్నమయ్య జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజంపేటలోని ప్రధాన రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ, ఎదురుగా వచ్చిన బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటలో భర్త మృతిచెందగా.. భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే వీరికి మూడు నెలల క్రితమే వివాహమైనట్లు స్థానికులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.