క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ను కలిశారు. అయితే తాజాగా ఆయన చేసిన ట్విట్ చర్చనీయాంశంగా మారింది. ‘సిద్ధం’ అంటూ అంబటి పోస్ట్ చేశారు. బుధవారం నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలాంటి సమయంలోనే అంబటి పోస్ట్ పెట్టడం చర్చకు దారి తీసింది.