ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా చికుర్బత్తి-పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ కోసం వెళ్లిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. DRG, CRPF, కోబ్రా టీమ్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.