హనుమాన్ ఆలయ భూముల సర్వే

69చూసినవారు
హనుమాన్ ఆలయ భూముల సర్వే
బెల్లంపల్లి మండలంలోని సంజీవని హనుమాన్ ఆలయానికి సంబంధించిన దేవాలయ భూములు కబ్జా కావడంతో జిల్లా సర్వే డిపార్ట్మెంట్ ఎడి శ్రీనివాస్ భూ సర్వే నిర్వహించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఆలయానికి సంబంధించిన భూములు ఆక్రమణ జరిగిన విషయంపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. దేవాలయ భూమిని తిరిగి స్వాధీన పరుచుకునేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్