14 అడుగుల కొండ చిలువ హతం

18182చూసినవారు
గ్రామస్థుల చేతిలో 14 అడుగుల కొండచిలువ హతమైన ఘటన మంగళవారం ఉదయం నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని చుచుంద్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో 14 అడుగుల కొండ చిలువ పశువుల మేతకు వెళ్లిన రైతుకు కనిపించింది. గ్రామస్థులకు సమాచారం అందించడంతో దానిని కర్రలతో హతమార్చారు. తరచు కొండ చిలువలు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్