ఆవుకు సీమంతం

12845చూసినవారు
ఆవుకు సీమంతం
ఇంటి ఆడపిల్లల మాదిరిగానే ఆవుకు సీమంతం జరిపించారు నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్పాడ్ గ్రామానికి చెందిన రైతు నర్సయ్య-మంజుల దంపతులు. చిన్నప్పటి నుంచి ఆవును ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి మంగళవారం వైభవంగా ఆవుకు సీమంతం జరిపించారు. పూలు, పండ్లు, చీరె, సారె, పసుపు, కుంకుమ తో సంప్రదాయబద్ధంగా సీమంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్