కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి సమీపంలో ఏనుగు సంచారం కలకలం రేపుతోంది. గురువారం రాత్రి కొండపల్లి మలుపు వద్ద బస్సుకు ఎదురుగా ఏనుగు వచ్చినట్టు ప్రయాణికులు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఏనుగు ఎవరి పైనా దాడి చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్రయాణికులు అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.