భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం తుది దశకు చేరుకుంది. ఈ మేరకు రేపు (జనవరి 6) సాయంత్రం 4 గంటలకు తన గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో తెలిపింది. వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడికి సంబంధించిన వివరాలను ఆదిత్య ఎల్-1 భూమికి పంపించనుంది. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 తన లక్ష్యం దిశగా దూసుకెళ్తోందని ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ అన్నారు.