ఎమ్మెల్యే పదవిలో ఉండి ఎంపీగా పోటీచేసి గెలిచిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. తాను ఎంపీగానే కొనసాగుతానని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సమాజ్వాది పార్టీ ఎంపీలతో ఇవాళ అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగానే కొనసాగుతానని, త్వరలో ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని స్పష్టంచేశారు.