
వైసీపీ మాజీ మంత్రి ఉష శ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు
వైసీపీ మాజీ మంత్రి ఉష శ్రీచరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సహా 25 మందిపై శనివారం పెనుకొండ పీఎస్లో కేసు నమోదైంది. మార్చి 27న తహసీల్దార్ కార్యాలయంలో పోలీసులను దూషించారని వారిపై కేసు నమోదు చేశారు. వీరిపై తమ విధులకు ఆటంకం కలిగించారని చెన్నేకొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఎస్సై సత్యనారాయణ ఫిర్యాదుతో పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.