మయన్మార్లో సంభవించిన భయానక భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. బహుళ అంతస్తుల భవనాలు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. ఇప్పటి వరకు 1725 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 3 వేల మందికి పైగా గాయాలైనట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. మయన్మార్లో రిక్టర్ స్కేల్పై అత్యధికంగా 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.