HYDలో మరో హత్య ఘటన వెలుగుచూసింది. బహదూర్పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్ రషీద్ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. షకీల్ అహ్మద్ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం జరిగింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చి రషీద్ తో గోడవపడ్డాడు. ఈ క్రమంలో రషీద్ ను షకీల్ కత్తితో పొడిచి చంపేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.