ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

56చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు తాజాగా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలియజేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ ఎంపీలకు ఆయన సూచించారు.

ట్యాగ్స్ :