నవంబర్‌ 2న ఎథిక్స్‌ కమిటీ ముందుకు హాజరవుతా: మహువా మొయిత్రా

67చూసినవారు
నవంబర్‌ 2న ఎథిక్స్‌ కమిటీ ముందుకు హాజరవుతా: మహువా మొయిత్రా
వెస్ట్ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు హాజరుకానున్నారు. ఈ మేరకు పార్లమెంటులో గౌతమ్‌ అదానీ కంపెనీలను, ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నవంబర్‌ 2న తాను ఎథిక్స్‌ కమిటీ ముందు విచారణకు హాజరవుతానని మంగళవారం మహువా వెల్లడించారు.

ట్యాగ్స్ :