నాగ్‌పూర్‌లో దారుణం.. పాదాలకు మసాజ్ చేయనందుకు 62 ఏళ్ల తండ్రిని హత్య చేసిన కొడుకు

54చూసినవారు
నాగ్‌పూర్‌లో దారుణం.. పాదాలకు మసాజ్ చేయనందుకు 62 ఏళ్ల తండ్రిని హత్య చేసిన కొడుకు
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. కుశాల్ అలియాస్ ఇంగ షెండే అనే 33 ఏళ్ల వ్యక్తి తన 62 ఏళ్ల తండ్రిని కొట్టి చంపాడు. గతంలో నేర చరిత్ర ఉన్న కుశాల్ తన పాదాలకు మసాజ్ చేయాలని తన తండ్రిని కోరాడు. దీనికి తన తండ్రి నిరాకరించడంతో అతని ఛాతీ, కడుపు, పక్కటెముకలు, తలపై తన్నాడు. దారుణంగా కొట్టాడు. అనంతరం తన తండ్రిని ఆస్పత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్