టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక ఆలయం, ఆలయ నిర్వహణ సంస్థ జీయర్ ట్రస్ట్పై దావా వేశాడు. తన మాజీ భార్యతోపాటు అష్టలక్ష్మి గుడికి వెళ్లిన 11ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి రెండు భుజాలకు శంఖుచక్రాల గుర్తులు వేశారని తెలిపారు. పిల్లవాడు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10లక్షల డాలర్లు(రూ.8.33కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఇటీవల దావా వేశారు.