మేలో నెమ్మదించిన వాహన విక్రయాలు

66చూసినవారు
మేలో నెమ్మదించిన వాహన విక్రయాలు
దేశంలో ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు మే నెలలో నెమ్మదించాయి. అధిక ప్రాతిపదిక, సార్వత్రిక ఎన్నికల ప్రభావం అమ్మకాలపై పడటంతో స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. డీలర్ల నుంచి కంపెనీల మొత్తం 3,50,257 ప్రయాణికుల వాహనాలు(పీవీ) సరఫరా అయ్యాయి. ఏడాది క్రితం పంపిన 3,35,436 వాహనాలతో పోలిస్తే ఇవి 4 శాతం ఎక్కువ. అయితే దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు మాత్రం 1,43,708 నుంచి స్వల్పంగా పెరిగి 1,44,002కు చేరాయి.

ట్యాగ్స్ :