రైలులో ఏసీ పనిచేయడం లేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పూరీ- గాంధీధామ్ సూపర్ఫాస్ట్ రైలు బీ-5 కోచ్లో ఏసీ పనిచేయడంలేదని ప్రయాణికులకు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రైలు పలాసకు చేరుకోగానే.. ప్రయాణికులు దిగి ఆందోళన చేపట్టారు. ఏసీ బాగుచేస్తేనే.. రైలును కదలనిస్తామని తెలిపారు. విజయనగరం రైల్వేస్టేషన్లో ఏసీ బాగు చేస్తామని అధికారులు చెప్పడంతో రైలును కదలనిచ్చారు.