బానుడి ప్రతాపం.. వడదెబ్బతో నలుగురు మృతి

68చూసినవారు
బానుడి ప్రతాపం.. వడదెబ్బతో నలుగురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఏకంగా 8 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండ వేడికి తాళలేక నిన్న ఒక్కరోజే నలుగురు మృత్యు వాత పడ్డారు. మెదక్ జిల్లాలో కుమ్మరి శాకయ్య, ఆసిఫాబాద్లో పోర్తెటి శ్రీనివాస్, కరీంనగర్ లో గజ్జెల సంజీవ్, హనుమకొండలో అల్లె గోవర్ధన్ వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్