భానుడు భగభగలు

79చూసినవారు
భానుడు భగభగలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 7 గంటల నుంచి ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా పినపాక నియోజకవర్గ పరిధిలోని అశ్వాపురం మండలంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా బూర్గంపహాడ్ మండలంలో 39. 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 నుంచి 5గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దని వాతావరణ శాఖ సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్