న్యూఢిల్లీ న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఆ బాలుడితో సహ విద్యార్థులకు గొడవ జరిగింది. దీంతో ఆ బాలుడిని వారు విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా బాలుడి ప్రైవేట్ పార్ట్స్లో కర్ర చొప్పించారు. విషయం బయటకు చెబితే అతడి సోదరికి కూడా ఇలాగే చేస్తామని బెదిరించారు. బాలుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.