ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాడి కేసులో తన అరెస్ట్ను హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. కాగా ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు సోమవారం తిరస్కరించింది.