కేంద్ర కేబినెట్లో పీఎం మోదీతో సహా మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు. అయితే బీజేపీ నుంచి 61 మంది మంత్రులయ్యారు. టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జేడీఎస్, శివసేన, అప్నాదళ్, హెచ్ఏఎం, ఆర్పీఐ పార్టీలకు ఒక్కోటి చొప్పున మొత్తం 5గురికి మంత్రి పదవులు దక్కాయి.