పదో తరగతి తర్వాత ఎక్కువ మంది చేరే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ గ్రూప్లు ఉన్నాయి. వీటిల్లో ప్రతి గ్రూప్ దేనికదే ఎంతో ప్రత్యేకమైనది. ఎంపీసీతో ఇంజనీరింగ్తోపాటు హోటల్ మేనేజ్మెంట్, లా, తదితర కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. బైపీసీతో ఎంబీబీఎస్తోపాటు అగ్రి కోర్సులు, ఆయుష్ కోర్సుల్లో చేరొచ్చు. సీఈసీ, ఎంఈసీ కోర్సులు కార్పొరేట్ కెరీర్స్కు మార్గంగా నిలుస్తున్నాయి.