2023-24 ఏడాదిలో జరిమానా రూపంలో రూ.300 కోట్లను వసూలు చేసినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. టికెట్ లేని ప్రయాణం, ముందస్తుగా బుక్ చేయకుండానే లగేజ్ను తరలించడం.. తదితర కారణాలతో నమోదు చేసిన 46.26 లక్షల కేసుల్లో భారీ స్థాయిలో జరిమానా వసూలు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 2023-24 ఏడాదిలో దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో వసూలైన మొత్తంతో పోలిస్తే ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు.