కిర్గిజ్స్థాన్లో భారత విద్యార్థులపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆదేశాలతో అధికారులు బిష్కక్లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీతో మాట్లాడారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. స్థానిక ఘటనల్లో మన విద్యార్థులెవరూ గాయపడలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలో నిజం లేదని వెల్లడించారు.