దేశంలో ఓ రైల్వే స్టేషన్కు నేమ్ బోర్డు లేకపోయినా రైళ్లు అక్కడ ఆగుతాయంటే నమ్ముతారా? పశ్చిమబెంగాల్లోని రైనా & రైనాగఢ్ అనే రెండు గ్రామాల మధ్య ఇది ఉంది. దీనికి రైనాగఢ్ స్టేషన్గా పేరు పెట్టారు. స్టేషన్ తమ భూభాగంలో ఉందని, తమ ఊరి పేరే పెట్టాలని రైనా గ్రామస్థులు వాదిస్తున్నారు. ఈ వివాదం ముదరడంతో రైల్వేశాఖ స్టేషన్ పేరును తొలగించింది. టికెట్లో రైనాగఢ్గా ఉంటోంది. ప్రస్తుతం ఆ రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.