5 రోజుల్లో లక్ష మందిని కలిసిన సీఎం

53చూసినవారు
5 రోజుల్లో లక్ష మందిని కలిసిన సీఎం
ఒడిశాలోని కొత్త సీఎం మోహన్​ చరణ్​ మాఝి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జెట్ స్పీడులో దూసుకెళ్తున్నారు. ఆయన కేవలం 5 రోజుల్లో దాదాపు లక్ష మందికి తనను కలిసే అవకాశం కల్పించి ఒడిశా సీఎం వార్తల్లో నిలిచారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అతిథిగృహంలో తనను ప్రజలు కలిసేందుకు ఆయన అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగుల నుంచి సాధారణ ప్రజల వరకు దాదాపు లక్షమందిని సీఎం కలవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్