ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై హైకోర్టు న్యాయవాది సురేశ్ ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసులో నిందితులు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేశారని.. దీనిపై కేసు నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదన్న సురేశ్.. ఈడీ దర్యాప్తు చేస్తే మూల కారకులు బయటకు వస్తారని తెలిపారు.