163 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నాం: హరీశ్

59చూసినవారు
డిజిటల్ సర్వేకు ఒప్పుకోలేదన్న కారణంతో 163 మంది AEOలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు BRS నేత హరీశ్ రావు పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ సర్వే చేయిస్తుంటే, తెలంగాణలో AEOలపై అదనపు భారాన్ని రుద్దుతూ వేధింపులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. AEOలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, డిజిటల్ సర్వే ఏఈవోలకు భారం కాకుండా చూడాలన్నారు.