అందరినీ కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్: ఎంపీ అభ్యర్థి నీలం మధు

54చూసినవారు
అందరినీ కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్: ఎంపీ అభ్యర్థి నీలం మధు
దేశంలో అన్ని కులాలను కలుపుకుపోయే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, సీనియర్ నేత పులిమామిడి రాజుతో కలిసి సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తా వరకు ర్యాలీగా చేరుకొని రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా మద్ధికుంట చౌరస్తా కార్నర్ మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం చూపుతూ వస్తోందన్నారు. ముఖ్యంగా పేదలకు ఇండ్లు, భూములు ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అన్ని వర్గాలకు మేలు చేసే రోజులు ముందున్నాయని స్పష్టం చేశారు. తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించి, ప్రజా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్