పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఒత్తిడి చేస్తోంది: పల్లా రాజేశ్వర్‌రెడ్డి

63చూసినవారు
పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఒత్తిడి చేస్తోంది: పల్లా రాజేశ్వర్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లోనే తన కుటుంబంపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. అమెరికాలో నిర్వహించిన మీట్‌&గ్రీట్‌లో ఆయన మాట్లాడారు. కేసులు, అరెస్టులు తనకు కొత్త కాదని, న్యాయపోరాటం చేస్తానని అన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు.