దేశవ్యాప్తంగా నీట్, నెట్ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్నాల లీకేజీ వివాదాల నేపథ్యంలో పేపర్ లీక్కు పాల్పడినవారిపై చట్టపరంగా కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది. చట్టవిరుద్ధంగా పరీక్ష పత్రాలను అందుకున్నా, ప్రశ్నలు, సమాధాలు లీక్ చేసినా, పరీక్షకు హాజరయ్యేవారికి అనుచిత సాయం చేసినా.. అందుకు బాధ్యులైవారికి కనీసం మూడేళ్ల, గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశమున్నది.