కాంగ్రెస్ నేతలు తనపై దాడి చేశారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సోమవారం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా నార్కట్పల్లి కాంగ్రెస్ నేతలు డోకూరు పంక్షన్ హాలులో గ్రాడ్యుయేట్ ఓటర్లకు డబ్బులు పంచు పంచుతున్నారని అశోక్ ఆరోపించారు. అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారని, వీడియో తీస్తున్న సిబ్బందిపైన దాడి చేశారని, సెల్ఫోన్లను ధ్వంసం చేశారని అశోక్ ఆరోపించారు.