మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ పోర్ష్ కారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో అనుకోని ట్విస్ట్ను దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్లు అజేయ్ తావ్రే, హార్నూర్ మార్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో డాక్టర్లను అదుపులోకి తీసుకొన్నారు.